చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
సంవత్సరాల కేనీ ఆర్ పాలనలో రాష్ట్రానికి
ఒరిగిందేమీ లేదని రాష్ట్ర అభివృద్ధి కేవలం బిజెపితోనేbసాధ్యపడుతుందని హయత్
నగర్ డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్
పురపాలక పరిధిలోని లక్కారం గ్రామ భాజపా ఇన్చార్జ్ గా ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో సూర్య దినపత్రిక పలకరిస్తే వారు మాట్లాడుతూ కెసిఆర్ రాష్ట్ర ప్రజలను
ఏనాడో మరిచిపోయారని కేవలం కుటుంబానికే పరిమితమై కుటుంబ
అభివృద్ధి నే చూస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో డబ్బు రాజకీయాలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం
చెబుతారన్నారు. కెసిఆర్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎంతమంది మంత్రులను మునుగోడులో దింపిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం ఆపలేరున్నారు. మునుగోడు లో భాజపా విజయానికి బూతు
స్థాయిలో ప్రతి భాజపా కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Post A Comment: