కాటారం పట్టణంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్లో బుధవారం ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అదేవిధంగా సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ, నేరాల నియంత్రణలో వాటి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా మారి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఎస్ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: