ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 175 అర్జీలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వై. వి.గణేష్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కే నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Post A Comment: