హన్మకొండ ;

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.  ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలు, జిల్లా సమైఖ్య సభ్యులు, గ్రామ సమైఖ్య సభ్యులకు వివిధ శాఖల వారీగా ఈ సందర్భంగా ఆస్తులను పంపిణీ  చేయనున్నారు. 

ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ అటవీ

శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు దిశానిర్థేశం చేశారు. వరంగల్‌ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల పై శుక్రవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూట్‌ మ్యాప్‌, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్‌ తదితర లాజిస్టిక్‌ అంశాలపై అధికారులతో చర్చించారు. భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను అందరం కలిసి దిగ్విజయం చేయాలని పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం గతేడాది కాలంలో చేపట్టిన  అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విజువల్స్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. 19న వరంగల్‌లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన, ప్రజా పాలన విజయోత్సవ సభ గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఏడాది కాలంలో తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ గా నిలిపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే నిదర్శమని చెప్పారు. 

స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ అండ్ బి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఐ అండ్ పీఆర్ హరీశ్, వరంగల్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: