ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;




రాజీమార్గం రాజమార్గమని, పగ, ప్రతీకారాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే   బుధవారం  తెలిపారు.  ఈ నెల 28న  నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను  కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ  సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులలో మరియు  ఇతర రాజీపడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.  పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్ళు, పోలీసులు రాజీపడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాలను, పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని  సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని ఎస్పీ  తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: