ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భూపాలపల్లి జిల్లా ఓఎస్డీ (అదనపు ఎస్పీ ఆపరేషన్) గా బోనాల కిషన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. బోనాల కిషన్ 1995 లో ఎస్సై గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.
పరకాలలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసి శాయంపేట పోలిసు స్టేషన్ లో మొదటి పోస్టింగ్, తర్వాత భూపాలపల్లి, పరకాల, హసన్ పర్తి వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పని చేసాడు.
2006లో సీఐగా యాగ్జిలరీ పదోన్నతి పొంది, చిట్యాల, ములుగు, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హన్మకొండలో విధులు నిర్వర్తించారు.
2019 లో డీఎస్పిగా పదోన్నతి పొంది, కాటారం, వరంగల్ నిజామాబాద్ లలో పనిచేస్తూ ఆగస్టు 2024లో పదోన్నతి పొంది భూపాలపల్లి ఓఎస్డీ (అదనపు ఎస్పి ఆపరేషన్) గా బదిలీపై జిల్లాకు వచ్చారు. ఓఎస్డీ గా ( అదనపు ఎస్పీ ఆపరేషన్ ) గా బాధ్యతలు స్వీకరించిన బోనాల కిషన్ కు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: