ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భూపాలపల్లి నియోజక వర్గంలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ , బిఎస్ ఎఫ్ కేంద్ర బలగాలు, పారెస్ట్, టిఎస్ ఎస్పీ శిక్షణ కానిస్టేబుళ్లకు జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో శనివారం ఎస్పి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లో వద్ద నిర్వర్తించాల్సిన విధులు, పొలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పి వివరించారు. పోలీసు అధికారులు సిబ్బందికి ఏదైనా సందేహాలు ఉంటే పై అధికారుల వద్ద తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయం ప్రకారం ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను 100 మీటర్ల పరిధిలో గుమిగూడకుండ చూడాలని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటరు స్లిప్పులు, జిల్లా ఎన్నికల అధికారి అనుమతి పొందిన ఐడి కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతించాలన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఓ.ఆర్.ఎస్ మంచినీటిని ఎక్కువగా తాగుతూ పోలిసు, వివిధ విభాగాల ఎన్నికల సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలు, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఎస్పి పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీయంలను స్ట్రాంగ్ రూముల వరకు పోలీసులు తరలించాలని ఎస్పి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. సంపత్ రావు, సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ బాబు, బిఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాన్డెంట్ అజయ్, భూపాలపల్లి, చిట్యాల సిఐ లు నరేష్ కుమార్, మల్లేష్, ఎలక్షన్ సెల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బీ ఇన్ స్పెక్టర్ వసంత్ కుమార్, రిజర్వు ఇన్ స్పెక్టర్లు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, సీఆర్పీఎఫ్ , బిఎస్ ఎఫ్ ఎస్సై లు, భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: