పెద్దపల్లి గోదావరిఖని, మే11, టీవీన్యూస్ఛానల్ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలకు చెందిన ప్రింటు &ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు పార్లమెంట్ ఎన్నికల వేళ పోలీసులు నిర్వహించవలసిన పనితీరు శనివారం వర్క్ షాప్ నిర్వహించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్..భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని పోలీసు,అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ,ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే ఎలాంటి వస్తువులను సరఫరా చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపడానికి రామగుండము పోలీస్ కమీషనరేట్ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని ఎన్నికల నిర్వాహణకు సంబంధించి,ఎన్నికల వేళ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ అన్నిరకాల ప్రణాళికలు ఏర్పాటు చేసామని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.మీడియా సమావేశంలో తెలిపారు,ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్,స్ట్రాజి కల్ సర్వలెన్స్ టీమ్స్,కండక్ట్ కోడ్ టీమ్స్,అలాగే స్టారికల్ సర్వేలెన్సు టీమ్స్ చెక్ పోస్ట్లు,ఏర్పాటు చేసి అక్కడ సివిల్ పోలీస్,స్టాటికల్ సర్వేలెన్ సిబ్బంది,కేంద్ర సిఐఎస్ఎఫ్ బలగాలు 24 గంటలు వాహనాల తనిఖీ నిర్వహింస్తున్నారు.రామగుండం కమిషనరేట్ లో ఉన్న అధికారులు,సిబ్బంది,మహిళా సిబ్బంది,కమీషనరేట్ స్థానిక సాయుధ బలగాలు,హోంగార్డులు,ట్రైనింగ్ కానిస్టేబుళ్లు,ట్రైనింగ్ సిబ్బంది,కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్,సీఆర్పిఎఫ్,మొత్తం అధికారులు సిబ్బందితో లోక్ సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ సందర్భంగా,సిపి మాట్లాడరు,లోకసభ ఎన్నికలకు సర్వంసిద్ధం చేసినట్లు తెలిపారు.ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో కేంద్ర పారామిలిటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పారదర్శకం నిష్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామనన్నారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి ప్రతిరోజు తనిఖీలు నిర్వహింస్తూనట్టు, తెలిపారు,ఎన్నికల కోడ్ అమలు నుండి ప్రేరేపిత రహిత ఎన్నికల నిర్వహణలో జప్తు చేసినవి,రూ1,79,23,892-నగదు.రూ 81,02,691- విలువ గల
1.042 బంగారం,రూ 6.734 వెండి స్వాధీనం.రూ4,17,775-విలువ చేసే 11.211 కిలోల గంజాయి స్వాధీనం.మద్యం-2845.73 లీటర్లు,పటిక-23 కిలోలు,బెల్లం-22 కిలోలు స్వాధీనం.వీటి విలువ రూ15,03,069/-671కేసుల్లో 1444 మందిని 107సిఆర్.పిసి110సిఆర్ పిసి,151సిఆర్.పిసి సెక్షన్స్ కింద బైండోవర్131ఎన్ డబ్ల్యుఇలు అమలు.ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ లు1,ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ లు11,ఎస్ఎస్ టీమ్స్16,ఎఫ్ఎస్టి,టీమ్స్ 17,మొత్తం పోలీంగ్ కేంద్రాలు1568,క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు179నార్మల్ పోలింగ్ స్టేషన్లు 1372,పోలింగ్ లొకేషన్లు 905,క్రిటికల్ పోలింగ్ లోకేషన్లు76నార్మల్ పోలింగ్ లొకేషన్లు 813 ఎల్ డబ్ల్యూఈ పోలింగ్ స్టేషన్లు17 లోకేషన్లు16రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 85 ఆయుధాల లైసెన్స్ కలిగిన వారు,వీరిలో (51)మంది ఆయా పోలీస్ స్టేషన్లలో ఆయుధాలను డిపాజిట్ చేశారు.ఇందులో బ్యాంకు సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే మినహాయింపు కలదు..ఫ్లాగ్ మార్చ్ పట్టణాలలో గ్రామాలలో 26 నిర్వహించినట్టు తెలిపారు,రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో 1903 నాఖబంది కార్యక్రమాలు నిర్వహించారు,10 కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాములు,12 ఏరియా డామినేషన్స్,సిఆర్పిఎఫ్,బిఎస్ఎఫ్ కలిపి ఐదు కంపెనీ 443 మంది,పెట్రోలింగ్ పార్టీలు,క్విక్రియాక్షన్ విభాగాలు,స్ట్రెకింగ్ ఫోర్స్,స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్ బృందాలను ఎర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియామవళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాటు చేసినట్లుగా పోలీస్ కమిషనర్ తెలిపారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు,గ్రామాల్లో ఎన్నికలపై గ్రామాల ప్రజలకు పోలీసు కళాబృందం ద్వారా జానపద కథలు,నాటకాలు,పాటల ద్వారా ప్రజలకు ఓటు హక్కు గురించి,వారు నిర్భయంగా ఓటు వేయడానికి శాంతియుత వాతావరణాన్ని కలిపించడం కోసం పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల గురుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు,ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గోప్పదని,ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్చందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించడంతో పాటు ఎన్నిక ప్రవర్తన నియామవళిని అతిక్రమించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.ఈ మీడియా వర్క్ షాప్ కార్యక్రమంలో,అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు,ఏఆర్ ఏసీపీ లు ప్రతాప్,సురేంద్ర,పెద్దపెల్లి మంచిర్యాల జిల్లాల సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: