ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రేపటి నుండి నాలుగు రోజుల పాటు ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరకు చేసిన ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు శాఖల వారిగా అధికారులతో సమీక్షించారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ జాతర పనులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం పరిశీలించారు.
జాతర కు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలను, పబ్లిక్ టాయిలెట్స్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా వెహికల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి పోలీస్ శాఖ వారికి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు. జాతరలో పూర్తి కాబడిన పనులను వివిధ శాఖలతో సమీక్షించినారు. రెడ్ క్రాస్ హనుమకొండ వారు జాతర లో ఏర్పాటు చేసిన వైద్య శిభిరమును శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శాసనసభ్యులు పరకాల గారితో కలిసి ప్రారంభ చేసినారు. వివిధ మండలము నుండి వచ్చిన అధికారులకు వారు చేయవలసిన డ్యూటీ పనులను నిర్వర్తించడం లో తగు సూచనలు చేసినారు, రాబోవు నాలుగు రోజులు చాలా జాగ్రత గా విధులు నిర్వర్తించాలని కోరినారు.భక్తులకు ఎలాంటి అసౌకార్యం కలుగ కూడదని అధికారులకు తగు అదేశములు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిషోర్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఆత్మకూరు సిఐ సంతోష్, ఈవో శేషగిరి, పంచాయతీరాజ్ డిఇ లింగారెడ్డి, ఎస్ఆర్ఎస్పి డిఈ వేణుగోపాల్, ఎలక్ట్రిసిటీ ఏఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సతీష్, ఏపీవో రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: