ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని

సోమవారం న్యూ ఢిల్లీ నుంచి కేంద్రఎన్నికల సంఘం 

సీనియర్ డిప్యూటీ  కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధత పై  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .

ఈ సందర్బంగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల అవుతుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కు అర్. ఓ కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్న్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలని, ఒకే గడియారం  ఉండాలని అన్నారు. మనకు వచ్చిన ప్రతి నామినేషన్ వివరాలను  ఆన్ లైన్ యాప్ లో నమోదు చేయాలని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని,  తాజా అందుబాటులో ఉన్న  ఫ్రీ గుర్తులను మాత్రమే కేటాయించాలని అన్నారు.

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత అవసరమైన బ్యాలెట్ పేపర్ల తయారీ బ్యాలెట్ యూనిట్లు పోస్టల్ బ్యాలెట్స్ సిద్దం చేసుకోవాలని, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాల భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే సెక్టార్ అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. 

పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతుల కల్పన పై శ్రద్ధ వహించాలని అన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది, మీడియా ప్రతినిధుల, అత్యవసర సేవల సిబ్బంది కి  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.

జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు. రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని  అన్నారు.

ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతి రోజు వచ్చే ఆపిల్  పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.

నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులు సకాలంలో  నిష్పక్షిపాతంగా నిబంధనలో మేరకు నిర్వహించాలని, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలని అన్నారు. 

నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి .కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్త పట్నాయక్ అదనపు కలెక్టర్ మహేందర్ జీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ద శుక్ల అర్.డి. ఓ లు రమేష్,శ్రీనివాస్ డిఆర్డిఏ పీడి   శ్రీనివాస్, డిసీఓ  నాగేశ్వరావు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: