ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణ పనులను గురువారం మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ ను , పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా జిల్లా డిపిఓ ఆఫీస్ పూర్తి చేయాలని, నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జిల్లా పోలీస్ కార్యాలయం తో పాటు కలెక్టరేట్, మెడికల్ కాలేజ్ ను ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి వెంట కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జె. సురేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, అదనపు ఎస్పీ ఏ.ఆర్ వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, మున్సిపల్ చైర్మన్ సెగ్గo వెంకట్రాణి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: