మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పి ఓ డబ్ల్యూ జాతీయ కన్వినర్ కా. వి.సంధ్య,హక్కుల నేత ప్రొ. హరగోపాల్ మేధావులు తదితర నాయకులపై తాడ్వాయి పోలీసులు పెట్టిన ఉపా కేసును ఎత్తివేయాలి
జి ఎల్ బి కే ఎస్ ఐఎఫ్టియు
ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను,హిందుత్వ ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా మాట్లాడి నందుకు,మహిళలపై జరిగే దాడులను నిలదీసి అండగా ఉన్నందుకు పి ఓ డబ్ల్యూ జాతీయ కన్వినర్ కామ్రేడ్ వి.సంధ్యక్క ప్రొఫెసర్ హరగోపాల్ తదితర 152 మందిపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖoడిస్తున్నాo.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆదేశాల మేరకే ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు.పౌర హక్కులనేతలు,మేధావులు,ఆదివాసీ సంఘాల నాయకులపై పెట్టిన కుట్ర పూరిత ఉపా కేసును ఎత్తివేయాలి.
అధికారంలో ఉన్న పాలకులు అనుసరిస్తున్న చట్టవ్యతిరేక
చర్యలను ప్రశ్నించే గొంతులపై అక్రమకేసులు పెట్టి నిర్భందించే పద్ధతులను ప్రజాస్వామిక వాదులు ఖండించాలి
Post A Comment: