మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మే డే సందర్భంగాతెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు అందుకున్న టి .బి జి కె ఎస్ ఆర్ జి -1 జి.యం.కమిటీ మెంబర్ శ్రీ పుట్ట రమేష్ కు జి. డి. కె. 1 సి ఎస్ పి లోని ఉద్యోగులచే సీఎస్పీలో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి డి కె 1& 3 ఇంక్లైన్ మేనేజర్ డి రమేష్ బాబు , సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస రావు , పిట్ సెక్రటరీ గండు శ్రావణ్ కుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ హనుమంతరావు, సి.ఎస్.పి ఇంచార్జ్ హెచ్.ఓ .డి. బూస శ్రీనాథ్ ,అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ పెగడపల్లి సుభాష్ 9వ వార్డు కార్పొరేటర్ కవితా సరోజిని, కెమిస్ట్ మల్లికార్జున్ ,ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ రాజేశ్వరరావు ,బొల్లి సమ్మయ్య ఓ. ఎస్ వేణు పాల్గొనగా జలపతి రెడ్డి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పుట్ట రమేష్ వారివిద్యాభ్యాసం నుండే సేవా భావం కలిగి మరియు విద్యార్థి దశలో ఉద్యమ కార్యక్రమాలు చేస్తూ స్టూడెంటు యూనియన్ లో పాల్గొనేవారు అని,మరియు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తీవ్రంగా పోరాడారని కొనియాడారు. ఇట్టి శ్రమశక్తి అవార్డు తీసుకోవడానికి పూర్తి అర్హుడని అదేవిధంగా వారికి బాధ్యతలు కూడా పెరుగుతాయని గుర్తు చేశారు . అయితే ఈ కార్యక్రమంలో పుట్ట రమేష్ కు సిఎస్పీలోని ప్రతి ఉద్యోగి మరియు అన్ని సెక్షన్ల ఉద్యోగులు,కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ రమేష్ మీద ఉన్న ప్రేమ అభిమానంతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అనేకమంది ఉద్యోగులు,కాంట్రాక్టు కార్మికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post A Comment: