మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంలో రామగుండం ప్రాంతంలోని వివిధ పార్టీల, ట్రేడ్ యూనియన్ల, పౌరహక్కుల సంఘాల నాయకులను
అరెస్ట్ చేసి గోదావరిఖని నుండి మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఈ ప్రాంతానికి వస్తున్న మంత్రి కె టి రామారావు గతంలో ఇచ్చిన హామీల సంగతేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ ప్రాంతంలోని అనేక సమస్యలతో ప్రజలు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వారి రాజకీయ ప్రయోజనాల కోసం గాలి పర్యటనలు చేస్తూ రాజకీ పబ్బం గడుపుకుంటున్నా పరిస్థితి కనపడుతుంది.
గతంలో టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేకుండా పర్యటనల పేరుతోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గత హామీలను అమలుపరచాలని ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ,ఐ ఎఫ్ టీ యు డిమాండ్ చేస్తున్నాయి.
ఈరోజు తెల్లవారుజామున మా నాయకుల ఇండ్ల వద్దకు వెళ్లి మా పార్టీ *సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులైన ఈదునూరి నరేష్ గోదావరిఖని 1వ టౌన్, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్ గోదావరిఖని 2 టౌన్ ,జిల్లా ఉపాద్యక్షులు చిలుక శంకర్ ను ఎన్ టి పి సి టౌన్ , ఎ ఐ కే ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య అంతర్గాం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు పాటు వివిధ పార్టీల, ట్రేడ్ యూనియన్ల, పౌరహక్కుల సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం
Post A Comment: