మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి లో గత ఇరవై సంవత్సరాలకు పైగా వివిధ విభాగాల్లో చాలిచాలని వేతనాలతో, ఎలాంటి చట్ట బద్ద సౌకర్యాలు లేకుండా పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను మెడికల్, విటిసి లేదనే పేరుతో యాజమాన్యం, కాంట్రాక్టర్ లు వేదింపులకు గురిచేయడం సరైంది కాదని, ఈ విషయం లో యాజమాన్యం కాంట్రాక్టర్ లపై, కాంట్రాక్టర్ లు కార్మికుల పై ఒత్తిడి చేయరాదని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్, ఆర్జీ వన్ బ్రాంచి సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు శనగల శ్రీనివాస్ లు పేర్కొన్నారు. మంగళ వారం ఆర్జీ వన్ జి.ఎం. ఆఫీసు వద్ద జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాలలో గత ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం మెడికల్, విటిసి లేదనే కాంట్రాక్టర్ లపై ఒత్తిడి తెచ్చి కార్మికుల ను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని వారు మండి పడ్డారు. వీటీసీ, మెడికల్ అనేది ఉద్యోగంలో చేరినప్పుడు మాత్రమే ఉంటుందని, మధ్యలో ఉండదని వారు పేర్కొన్నారు. సింగరేణిలో సుమారు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు వివిధ విభాగాలలో ఎలాంటి చట్టబద్ధత కల్గిన హక్కులు, సౌకర్యాలు అమలుకు నోచుకోకు, రక్షణ కరువై ప్రమాదపు అంచుల్లో ఫర్మెంటు కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను, సింగరేణి యాజమాన్యం ఏ మాత్రం పట్టించు కోకుండా అధిక పని భారం మోపుతూ, ఒత్తిళ్లకు గురి చేయడం సరైన పద్ధతి కాదని డిమాండ్ చేశారు.వివిధ విభాగాలలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఎండ తీవ్రతకు తట్టు కోలేక పోతున్నారని సింగరేణి సంస్థ మనుగడ కోసం పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు భద్రత కల్పించవలసిన బాధ్యత యాజమాన్యం పై ఉందని వారన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఒకటవ కేటగిరి వేతనం చెల్లించాలని , పిఎఫ్ ఈఎస్ఐ, వైద్యం, సౌకర్యాలు కల్పించి కాంట్రాక్టు కార్మిక కుటుంబాలను కాపాడుకోవాలి తప్ప కార్మికులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరాదని వారు యాజమాన్యం ను డిమాండ్ చేశారు, లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు, కాంట్రాక్టు కార్మికులు నాగమణి, భాగ్యలక్ష్మి, మొగిలి లక్ష్మి, విజయ లక్ష్మి, పద్మ, మాధురి, దిలిఫ్, క్రిష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: