మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి అన్నపూర్ణ కాలనీలోని సిఐటియు కార్యాలయంలో పీకే రామయ్య క్యాంపులోని ఇళ్ల స్థలాలు పోరాట 3వ కేంద్రం టీం లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం నాయకులు మరియు
మూడో కేంద్రం కన్వీనర్ కామ్రేడ్ ఎన్ బిక్షపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇళ్ల స్థలాల పోరాటాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, ఇళ్ల పట్టాలు ఇచ్చేంతవరకు సమరశీల పోరాటాలు చేయాలని కోరడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఇళ్ల స్థలాల పోరాటాలను సందర్శించి ప్రోత్సహించడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు తేదీ 18.05.203 న గోదావరిఖని వస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో జరుగు బహిరంగ సభ, దానికి ముందు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి చౌరస్తా వరకు వేలాది మందితో జరుగు ప్రజా ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టిపిసి రామగుండం ఏరియా సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ ఎం రామాచారి, సీపీఎం నాయకులు లక్ష్మారెడ్డి మరియు మూడవ కేంద్రం పోరాట కమిటీ టీం లీడర్లు బీర్క సుజాత, గొట్టిపర్తి కరుణ, అల్లాడి అలివేలుమంగ, మాదాసు లక్ష్మి, కాసిపేట రాజయ్య, శ్రీనివాస్, సయ్యాద్ముంతాజ్, విజయ్ కుమారి, స్వర్ణలత తో పాటు 30 మంది టీం లీడర్లు పాల్గొన్నారు.
Post A Comment: