మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
ధర్మసాగర్ : జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ కు చెందిన ఓ ముఖ్యమైన బిఆర్ఎస్ నేత తనను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నాడని ధర్మసాగర్ మండలం, జానకిపురం సర్పంచ్ కూర్సపల్లి నవ్య ఆరోపించారు.
గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. మండలంలోని ఓ మహిళ నేతను కొందరు ప్రజాప్రతినిధులు, సదరు నాయకుడి కోరిక తీర్చాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయింది. వారి మాట వినలేదని గ్రామ అభివృద్ధి నిధులు కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని,పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆవేదన చెందారు. వారికి అక్క చెల్లెలు లేరా?అంటూ ప్రశ్నించారు. ఆస్తులు బంగారం అమ్ముకుని ప్రజలకు సేవ చేస్తున్నామని, నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని తెలిపింది. ధర్మసాగర్, వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనమని, రెండు మూడు వర్గాల గ్రూప్ రాజకీయాలు ఉండటంతో అభివృద్ధి కుట్టుపడుతుందని చెప్పారు. గత నెలలో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు, ఓ మహిళా ప్రజా ప్రతినిధి తనను తీవ్రంగా అవమానించారంటు ఏడ్చేశారు.....
Post A Comment: