మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గ పరిదిలోని నిరుపేదలు వివిధ అనారోగ్య కారణాలతో కాళ్ళు చేతులు కోల్పోయి వికలాంగులుగా మారి ఎలాంటి పనులు చెయ్యలేక ఇంటికే పరిమితం అయిన ఏడు నిరుపేద కుటుంబాలకు సేవ స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో బాధితులకు ప్రతి నెల పది కిలోల బియ్యం అందజేస్తూ బాధిత కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటున్నా సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు బాధితుల ఇంటి దగ్గరకు వెళ్లి పది కిలోల బియ్యం అందజేశారు అనంతరం సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో కాళ్ళు చేతులు కోల్పయిన వారికీ సేవా స్పూర్తి ఫౌండేషన్ తరుఫున ప్రతి నెల పది కిలోల సన్న బియ్యం. అందజేస్తామని గతంలో మేం సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగిందని మేం ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ప్రతి నెల పదోవ తేదీన బియ్యం పంపిణీ చేస్తున్నామని ఈనెల తో ఈ కార్యక్రమం మొదలు పెట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నామని మల్లేష్ తెలిపారు సేవా స్పూర్తి ఫౌండేషన్ కు సహాయ సహకారాలు అందిస్తు బాధితులకు అండగా ఉంటున్న ఫౌండేషన్ సభ్యులందరికి పేరుపేరున బాధిత కుటుంబాల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాని మడిపెల్లి మల్లేష్ అన్నారు బియ్యం పంపిణీ చేసిన బాధిత కుటుంబాలు ఎల్కలపెల్లి గెట్ కు చెందిన ముస్కె నర్సయ్య.రామగుండం కు చెందిన
కోట మంగ.ఎన్టీపీసీ కాకతీయ నగర్ కు చెందినమాదిరి రమేష్.37 వార్డు భరత్ నగర్ కు చెందిన
వినోద్ కుమార్. చంద్రశేఖర్ నగర్ కు చెందిన చొక్కుల లత.
రామగుండం లింగంపూర్ కు చెందిన ఇరికిళ్ల శ్రీనివాస్.
38 వార్డు సంజయ్ గాంధి నగర్ కు చెందిన బాగ్ అనిత కు
ఏడు కుటుంబాలకు ఈరోజు 10 కిలోల బియ్యం అందజేశామని మడిపెల్లి మల్లేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సేవా స్పూర్తి ఫౌండేషన్ ప్రతినిధులు కన్నూరి శంకర్. కసిపేట సతీష్.చింతల వంశీ.నిమ్మరాజుల రవి. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: