ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
బాలల బంగారు భవిష్యత్ కోసం వారి హక్కులను ప్రతీ ఒక్కరూ కాపాడాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు.
ఆదివారం హనుమకొండ, వరంగల్ కోర్టు ప్రాంగణంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్వల్ భయన్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్లానింగ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ హై కోర్ట్ జడ్జ్ నవీన్ రావు జ్యూడిషరీ ప్రోగ్రామ్ కు హాజరు అయ్యారు.
ఈ సందర్బంగా కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ దేశం లో ఉన్న ఇతర కోర్ట్ లును కోర్ట్ లు అన్న ఎటువంటి ఇబ్బంది లేదని, కానీ పిల్లలకోర్ట్ ను మాత్రం న్యాయ దేవాలయాలు గా పిలవాలి అని సూచించారు. వరంగల్ లో పోక్సో యాక్ట్ కేసులు 256 ఉంటే 146 కేసులను పరిష్కారం చేసారని, ఇందులో 40 కేసులకు శిక్ష పడిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా 92.6శాతం పెండింగ్ లో ఉండగా ఇక్కడ కోర్ట్ లో 40 శాతం పరిష్కారించడం అభినందచ తగ్గ విషయం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు భాగంగా ఇది సాధ్యం అయ్యింది అని అన్నారు. చిన్నారుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయాని అన్నారు. కోవిడ్ సమయం లో చిన్నారుల పై లైంగికదాడులు రెట్టింపు అయ్యాయని ఆందోళన వెలుబుచ్చారు.ఈ పరిస్థితి కేవలం మన దేశానికి పరిమితం కాదని , ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. చిన్నారుల పై దాడులు అన్నీ మతాలు, అన్నీ ప్రాంతాలలో జరగడం బాధ కరం అన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు సమన్వయంగా కృషి చేస్తేనే బాలలపై జరుగుతున్న ప్రమాదాలను నివారించగలమని చెప్పారు. మనసు చలించి పోయేటువంటి సంఘటనలు జరుగుతున్నాయని వాటన్నింటిని రూపుమాపాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. బాలలపై అసాంఘిక కార్యక్రమాలు ఎవరికి చెప్పాలో, ఎవరిని ఆశ్రయించాలో అన్న విషయాలపై పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. బాలల హక్కుల దినోత్సవాలు జరగాలని, వారి హక్కులను కాపాడాలని చెప్పారు.పిల్లలు సున్నితంగా ఉంటారని, వారిపై తల్లిదండ్రులు, సమాజం ప్రభావం గణనీ యంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి కేసులలో నిందితులు క్షమాపణ కోరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చిన్నారులకు, వారి కుటుంబ సభ్యులకు తక్షణమే నష్ట పరిహారం తో బాటు భద్రత కు భరోసా కల్పించాలని అన్నారు. బాధితులపై సమాజం చిన్న చూపు తగదని అన్నారు.
ముఖ్యం గా బాలికల కు సొంత కుటుంబ సభ్యుల మధ్య నే రక్షణ కొరవడింది అని అన్నారు. తమ పై జరిగిన లైంగిక దాడులు, గురించి ఎవరికీ చెప్పకపోవడం తో ఆ ప్రభావం బాలికల పై దీర్ఘ కాలం పడుతుంది అని ఆవేదన వెలి బుచ్ఛారు. తాను చేపట్టిన భారత్ యాత్ర మంచి ఫలితాలు ఇస్తుంది అని అన్నారు.
రాష్ట్ర ప్రధాన న్యాయ మూర్తి ఉజ్వల్ భయన్ మాట్లాడుతూ పోక్సో కోర్ట్ లు ఇతర జిల్లా లో కూడా విస్తరించాలని అన్నారు. బాల్య వివాహాలు జరగడానికి కుటుంబ పెద్దల ప్రోత్సాహం వాళ్ల నే జరుగుతున్నాయి అని అన్నారు.
ప్రతీ ఒక్కరూ నైతిక ప్రవర్తన అలవార్చుకోవాలి అని అన్నారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చిన్నారుల భద్రత కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు.
ఈ సమావేశానికి జిల్లా జడ్జి కే. రాధాదేవి, సభాధ్యక్షత వహించగా, హనుమకొండ, వరంగల్, పోలీస్ కమిషనర్ రంగనాధ్, కలెక్టర్లు, రాజీవ్ గాంధీ హనుమంతు, డా.గోపి, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీన్య, కుడా ఛైర్మెన్ సంగం రెడ్డి సుంధర్ రాజ్, లా కార్యదర్శి నర్సింగ రావు, జడ్జి కృష్ణ మూర్తి, బార్ కాన్సిల్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Post A Comment: