ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
వినాయక విగ్రహ నిమజ్జనాలు అత్యంత ప్రశాంతంగా జరిగేట్లు చూడండి. అవాంఛనీయ సంఘటనలేని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి. వినాయక మండళ్ళ బాధ్యులకు ముందుగానే తగు సూచనలు చేయండి
ప్రజలకు పూర్తి అవగాహన కల్పించండి. దారి మళ్లింపులు, నిమజ్జన ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, ప్రజలు పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలపై ముందే చెప్పండి. వరంగల్ ప్రశాంతతకు మారుపేరు. ఆ పేరు నిలబెట్టండి. అలాగే ఈనెల 16, 17, 18 తేదీలలో నిర్వహించే తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయండి. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఘనంగా జరగాలి. పకడ్బందీ ప్రణాళిక బద్ధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి.
జిల్లాల కలెక్టర్లు సిపి ఇతర ఉన్నతాధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాలు సజావుగా జరగాలి.
ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ మహానగరం మేజర్ గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుందర్ రాజ్, వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు గోపి కూడా వైస్ చైర్మన్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య సిపి తరుణ్ జోషి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: