ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ములుగు జిల్లా ల నోడల్ ఆఫీసర్ గా విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ ఎం. హరిత ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం హైదరాబాద్ నుండి హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం కు చేరుకున్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీవత్స కోట, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) అశ్విని తానాజీ వాంకడే లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ దశబ్ది ఉత్సవలను జిల్లాలలో ఘనంగా నిర్వహించడానికి అధికారులు అందరూ సమన్వయము తో పని చేసి విజయవంతం చేయాలి అని కలెక్టర్లు కు సూచించారు. ఈ సమావేశం లో హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీవత్స కోట, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) అశ్విని తానాజీ వాంకడే పాల్గొన్నారు.
Post A Comment: