మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్స్ లో సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు ప్రజా ఆకాంక్షల దీక్ష దివస్ను నిర్వహించి నిరసన తెలిపిన సిపిఎంఎల్ ప్రజాపంథా
దశాబ్ది ఉత్సవాల పేరుతో ఆర్భాటాలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కెసిఆర్ కు ఉత్సవాలు నిర్వహించే నైతిక అర్హత లేదని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వానికి ఆ హక్కు లేదని సిపిఎంఎల్ ప్రజపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య అన్నారు . సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర ఏడవ మహాసభ పిలుపు మేరకు ఈరోజు కడెం హరిత రిసార్ట్స్ లో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నందిరామయ్య మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసిందని నిరుద్యోగాన్ని పెంచిందని ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని చెప్పిన కేసీఆర్ క్రమబద్దీకరణ చేయడంలో విఫలమయ్యాడని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడంలో కెసిఆర్ మోసం చేశాడని రైతులకు రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని మోసం చేశాడని పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నాడని అర్హులైనటువంటి వారందరికీ రేషన్ కార్డు ఇవ్వడంలో విఫలమయ్యాడని నిరుద్యోగుల అందరికీ జీవన భృతి అందించడంలో విఫలమయ్యాడని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరుస్తానని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదని హామీల ప్రభుత్వంగా మారిందని నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగిందని రాష్ట్ర సాధన ఉద్యమంలో సబ్బండ వర్గాలు పాల్గొన్నాయని తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు కన్నీళ్లు ప్రజలకు మిగిలాయని రాజ భోగాలు కేసీఆర్ కుటుంబానికి మిగిలాయని అందినంత తెలంగాణ సంపద దోచుకున్నారని బంగారు తెలంగాణ ఏమో కానీ కెసిఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారిందని అన్నారు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాన్ని ఉదృతం చేయాలని అన్ని వర్గాల ప్రజల్ని కోరారు దీక్ష దివస్ సందర్భంగా ఈ నెల 12వ తారీకు రోజున నిర్మల్ జిల్లా కేంద్రంలో దీక్ష దివస్ను నిర్వహిస్తున్నామని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్) ప్రజా పంథా ఖానాపూర్ సబ్ డివిజన్ నాయకులు మడావి అంకుష్ రావు జక్కుల రాజన్న కుంచెపు ఎల్లయ్య, డి సుదర్శన్,షేక్ గోరె భాయ్, భీమ్రావు,జాకు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: