మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పారిశ్రామిక ప్రాంతమైన ఎన్ టి పి సి పరిధిలో ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఈరోజు నుండి సమ్మెలోకి వెళ్లడం జరిగింది. *డ్రైవర్లు చేస్తున్న సమ్మెకు సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా అనుబంధ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు సంపూర్ణ మద్దతును తెలుపుతున్నది.
రోజురోజు మార్కెట్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న వేతనం ఏమాత్రం డ్రైవర్ల కుటుంబాల పోషణకు సరిపోవడం లేదు.మార్కెట్ ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఉండాలి. డ్రైవర్ల వేతనాలు ఇతర చట్టబద్ధహక్కులు సౌకర్యాలు కల్పించుటకు అగ్రిమెంట్ నూతన ఒప్పందం చేసుకొని ట్రాక్టర్ డ్రైవర్లు చేస్తున్న సమ్మెను నివారించాలని కోరారు. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేదాకా సమ్మెను కొనసాగించాలని సమ్మెకు ఐ ఎఫ్ టి యు పరోక్ష ప్రత్యక్ష మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం.
Post A Comment: