మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



 తనపై నమ్మకం ఉంచి.. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన  రామగుండం ప్రజానీక సంక్షేమం కోసం  ఎల్లప్పుడు కృషి చేస్తానని  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. 

     శుక్రవారం స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో  ఏర్పాటుచేసిన  సిసి కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి  ఆయన ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని  ప్రతిరోజు ఉదయం ఎంతోమంది  ఈ మైదానానికి చేరుకొని  వాకింగ్ చేయడం అభినందనీయమన్నారు. ప్రతినిత్యం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల  ఎంతోమంది  ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు. అదేవిధంగా అనేకమందికి ఆరోగ్యాన్నిస్తున్న ఈ మైదానంలో త్వరలో వాకింగ్ ట్రాక్, జిమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ మైదానంలో ద్విచక్ర వాహనాల చోరీలు జరుగుతుండటంతో  స్థానిక వాకర్స్ టీం, క్రీడాకారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విన్నవించడంతో.. వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు  ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన జీవితం సంతోషాన్ని ఇస్తుందన్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజాక్షేత్రంలో  ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు, సమస్యలకు గురైనా తానున్నానని.. ఎలాంటి దిగులు చెందవద్దని  ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చందర్ ను శాలువాతో వాకర్స్ టీం సత్కరించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు  దొంత శ్రీనివాస్, కొమ్ము వేణు, బాల రాజ్ కుమార్, సీఐ ప్రసాద రావు,  నాయకులు తోడేటి శంకర్ గౌడ్, నారాయణదాసు మారుతి, బొడ్డు రవీందర్, జేవి రాజు, కలువల సంజీవ్, నీరటి శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, ఐ సత్యం, దాసరి శ్రీనివాస్, జడ్సన్ రాజ్, బెంధె నాగభూషణ్ గౌడ్, శ్రీధర్, పుర్మ శ్రీనివాస్, నామని శ్రీనివాస్, నీడ రమేశ్, సురేష్ తో పాటు వాకర్స్ టీమ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: