పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:మంథని:మే:13:ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత మదుకు ఘన సన్మానం,పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్దులాపూర్ గ్రామంకు చెందిన దార మొండయ్య(మధు)కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టుగా ఉగాది పురస్కారం పొందిన సందర్బంగా తూర్పుగోదావరి జిల్లా,రాజమండ్రిలో పేరు గాంచిన మంజీరా హోటల్ అవరణ లో శనివారం రోజున హెర్బల్ లైఫ్ వరల్డ్ టీమ్ టి చిన్నబాబు,టి ఈశ్వరరావు లు(అవార్డు గ్రహీత మధును)పుష్పగుచ్చం,శాలువాతో ఘనంగా సన్మానించారు,అనంతరం హెర్బల్ లైఫ్ సూపర్ వైజర్ శ్రీనివాసనాయుడు మాట్లాడారు,మధుకు ఈ అవార్డు రావడం పట్ల హార్షము వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.వార్త సేకరణలో నిర్భయంగా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ముందు వరుసలో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి జగన్,పూసపాటి కిరణ్ కుమార్ రాజు,బి భరత్,ఎం భాస్కర్,వి సత్య,బి శివాని,టి చిన్న బాబు,టి ఈశ్వరరావు,పి చంద్రయ్య,బి శ్రీనివాస్,ఇ సాంబశివరావు లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: