మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా ఓసీపీ3 కృషీ భవన్ మొదటి షిఫ్ట్, నైట్ షిఫ్ట్ డ్యూటీ కార్మికులను అప్యాయంగా పలకరిస్తూ, కలిసిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ .
ఈ సందర్భంగా జరిగిన గేట్ మీటింగులో కార్మికులను ఉద్దేశించి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లడుతూ,
ప్రకృతికి విరుద్ధంగా, సరిహద్దులోని సైనికుడి మాదిరిగా పని చేస్తున్న సింగరేణి కార్మికుల కష్టం వెలకట్టలేనిదని, కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం కార్మిక కుటుంబాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో విఫలమయిందని ఆరోపిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని ప్రైవేటుపరం చేసే చర్యలు కార్మికులంతా ఐకమత్యంతో వారి చర్యలను తిప్పికొట్టే మరో పోరాటానికి సిద్దంగా ఉండాలని కార్మికులను కోరుతూ,
గుర్తింపు సంఘం కేవలం పైరవీలకే పరిమితమై, కార్మికుల సంక్షేమాన్ని మరిస్తే ఇక్కడున్న శాసనసభ్యుడు వారికే వత్తాసు పలుకుతూ, కార్మికుల హక్కులను యాజమాన్యానికి తాకట్టు పెడుతున్న తీరును ప్రతీ ఒక్కరూ గమనించాలని కోరారు..
కార్మికుల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 18వేల పైచిలుకు పట్టాలు ఇప్పించిన చరిత్రని గుర్తు చేస్తూ, గడిచిన 25సంవత్సరాలుగా నా శక్తి మేర ప్రజలందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాను రానున్న రోజుల్లో మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరారు..
ఈ గేట్ మీటింగులో మాజీ కార్పొరేటర్ మారెల్లి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు మాదరబోయిన రవికుమార్, కార్పొరేటర్లు మహంకాళీ స్వామి, ఎండీ ముస్తఫా, సంపత్ రెడ్డి, తాళ్ళపెల్లి యుగెందర్, సిగిరి లింగమూర్తి, తిప్పారపు శ్రీనివాస్, సింహాచలం, దేవేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మార్క రాజు, ధూళికట్ట సతీష్, శ్రీనివాస్, సారయ్య, శివ, శంకర్, అశ్రఫ్, అరుణ్ లతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు..
Post A Comment: