ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, ఏప్రిల్ 3 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత జాగరూకతతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముందుగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై సమీక్షిస్తూ, మార్చి 15 నుండి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో35142మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందులో మొదటి సంవత్సరంలో 18630మంది విద్యార్థులు, రెండవ సంవత్సరంలో16512 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని అన్నారు. ఇందుకోసం 49 కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతి కేంద్రంలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని,అన్నారు49 చీఫ్ సూపరింటెండెంట్లు , 49శాఖాధికారులతో పాటు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, 3 సిట్టింగ్ స్క్వాడ్, 10 కస్టడీయ్సన్ టీములు ఏర్పాటు చేశామని వీరు పరీక్షలనిర్వహణనుఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అన్నారు. ప్రశ్న పత్రాల స్టోరేజికి 12పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇక ఏప్రిల్ 3 నుండి 13 వ తేదీ వరకు ఉదయం 9 .30 గంటల నుండి మధ్యాన్నం 12. 30 గంటల వరకు జరుగు పదవ తరగతి పరీక్షలకు బాలులు 6011 మంది,బాలికలు 5727 మంది మొత్తం 11 వేల 738మంది విద్యార్థులు హాజరు కానున్నారని అన్నారు. ఇందుకోసం ఏ.బి.సి. సెంటర్లు గా విభజించి నట్లు తెలిపారు. ప్రశ్న పత్రాల స్టోరేజికి 68 సెంటర్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. సి.సి.కెమెరాల నిఘాలో నిర్వహించు ఇట్టి పరీక్షలకు ఫ్లైయింగ్ బృందాలు, సిటింగ్ స్క్వాడ్ , కస్టోడియన్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు పోలీస్ శాఖ ప్రశ్న ప్రత్రాల స్టోరేజి, తరలింపు లో , పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, తహశీలుదార్లు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ లో అంటారాయణ కలుగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోనీ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వంటివి తీసుకురాకుండా తనిఖీ చేసి సమీపంలోని కలెక్టింగ్ పాయింట్ లో డిపాజిట్ చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ వాసు చంద్ర, కాజీపేట ఏసిపి శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్ , డీఈఓ అబ్దుల్ హై డిపిఓ జగదీశ్వర్, డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, ఆర్ టిసీ నుండి బాలు నాయక్, తదితర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: