మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని-: సింగరేణి కాంట్రాక్టు కార్మికులు వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిఎం ఆఫీస్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ .. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవో ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేల జీతాలు పెంచి భారతదేశంలోని అత్యధిక జీతం తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తన సొంత పనుల కోసం ప్రభుత్వాన్ని నడపడం కోసం సింగరేణి సంస్థ యొక్క నిధులను వాడుకుంటూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్టు కార్మికుల విషయంలో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ దొరల పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు ప్రజాక్షేత్రంలో సబ్బండ వర్గాలు తగిన బుద్ధి చెప్పాలని కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు

Post A Comment: