ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం  ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహించారు. వివిధ సమస్యలపై  ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాట్లాడుతూ

ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు  పరిశీలించి తగు చర్యలు తీసుకోని ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు.

ఈ సోమవారం నాడు ప్రజా వాణి కార్యక్రమంలో నగర పాలక సంస్థకు చెందినవి 12, దళిత బంధు, ఎస్సి కార్పొరేషన్,11, రెండూ పడక గదులు,5, గ్రామీణ అభివృద్ది సంస్థ, 4,  పౌర సరఫరాలు,3 మిగితావి రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖలకు సంబంధించినవి కలిపి మొత్తం ( 74 ) దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.ఈ కార్యక్రమలో, అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: