ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;


 వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్త పట్నాయక్, ప్రావీణ్య లు అధికారులను ఆదేశించారు.

బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జిడబ్ల్యూఎంసీ,  కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)అధికారులతో కలెక్టర్లు సమావేశమై  వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న, చేపట్టబోయే అభివృద్ధి పనుల పురోగతిని  సమీక్షించారు.

జీ.డబ్ల్యు.ఎం.సి. ద్వారా నిర్వహించే అభివృద్ధి పనులపై వారు సమీక్షిస్తూ గ్రేటర్ వ్యాప్తంగా 4 ప్రాంతాలలో ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయల వ్యయంతో మినీ స్టేడియాలు నిర్మించుటకు  గాను టెండర్ ప్రక్రియ,  శంకుస్థాపనలు అయినందున వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.  బంధం చెరువు అభివృద్ధి, సుందరీకరణ  పనులు చేపట్టాలన్నారు.  వేసవిలో గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలలో త్రాగునీరు ప్రతిరోజు సక్రమంగా అందేలా నిత్యం చర్యలు తీసుకుంటు పర్యవేక్షించాలని,  నీటి సరఫరా నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మానిటరింగ్ సెల్ కు వచ్చే లీకేజీలు,  నీటి సంబంధం సమస్యలు, ఫిర్యాదులను  ఎప్పటికప్పుడు  పరిష్కరించాలన్నారు.

 ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటి సరఫరా జరగాలని, సరఫరా లో  ఆటంకం ఏర్పడితే ప్రత్యాయంగా ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలనీ ఆదేశించారు. 

నీటి సరఫరా నిర్వహణలో ఇంటర్ కనెక్షన్ పనులు, స్లూయిస్ వాల్వ ల ఏర్పాటు చేయాలన్నారు.

నయీం నగర్ 100 ఫీట్ రోడ్ ప్రాంతంలో  కొనసాగుతున్న డక్ట్ పనులు  త్వరగా పూర్తి చేయాలని అన్నారు. 

ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ పనులు,పోచమ్మ కుంట జంక్షన్ పనులు,లక్ష్మీపురం మార్కెట్ పనుల్లో వేగం పెంచి సెప్టెంబర్ లోగా పూర్తి చేయాలి.

ముంపు నివారణ చర్యల్లో భాగంగా మహా నగరంలోని నాలుగు ప్రధాన నాలాలైన నయీమ్ నగర్, భద్రకాళి, బొంది వాగు, సాకరాసి కుంట,  తోపాటు  వాటికి అనుసంధానంగా ఉన్న ప్రధాన అంతర్గత నాలాల పూడికతీత పనుల్లోమరింత వేగాన్నీ పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే మే చివరి నాటికి పూర్తవ్వాలని ఆదేశించారు. 

 అదేవిధంగా రహదారులలో ఉన్న అన్ని మ్యాన్ హోల్ లకు  మూతలు ఏర్పాటు చేయాలన్నారు. 

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కొనసాగుతున్న కాళోజీ కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచి ఆగస్ట్ చివరి లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.  భద్రకాళీ మాడవీధుల నిర్మాణ నిమిత్తం  వెంటనే టెండర్  ప్రక్రియ ను  పూర్తి చేయాలన్నారు. ఐ.ఆర్.ఆర్.కు సంబంధించి సాంకేతిక అనుమతులు పొంది  టెండర్ పిలవాలని,

వరంగల్ బస్ స్టేషన్ నూతనంగా నిర్మించుటకు గాను వచ్చే నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని  హన్మకొండ, వరంగల్ కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో  కుడా సి.పి.ఓ.అజిత్ రెడ్డి, బల్దియా ఎస్ ఈలు ప్రవీణ్ చంద్ర, కృష్ణారావు, బల్దియా ఈ.ఈ లు  శ్రీనివాస్, రాజయ్య,  బి.ఎల్.శ్రీనివాస్, కుడా ఈ.ఈ.భీమ్ రావ్, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: