మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
హైదరాబాద్: నగరంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో సిట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ అయినప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి రాజశేఖర్ అని తేల్చింది సిట్. ఈ మేరకు టీఎస్పీఎస్సీకి శుక్రవారం తన నివేదికను అందించింది.టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా పని చేసేవాడు రాజశేఖర్. అయితే.. గతంలో టెక్నికల్ సర్వీస్లో పని చేసే రాజశేఖర్.. ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్పై వచ్చాడు. అక్కడ కంప్యూటర్ను హ్యాక్ చేసి పాస్వర్డ్ను దొంగిలించినట్లు సిట్ అనుమానిస్తోంది. ఇక విధుల్లో చేరాక..ప్రవీణ్తో సంబంధాలు నడిపాడు రాజశేఖర్. దాదాపు ఐదు పరీక్షా పత్రాలను పెన్డ్రైవ్లో కాపీ చేసి ప్రవీణ్కు ఇచ్చాడు. ఇందులో రెండు రోజుల్లోనే నాలుగు పేపర్లను కాపీ చేసుకున్నాడు. ఫిబ్రవరి 27 వ తేదీన, పేపర్ లను ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసాడు.ఇందులో జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చర్ పరీక్ష ప్రశ్నాపత్రం సైతం ఉందని సిట్ దర్యాప్తులో తేలింది(అందుకే పరీక్ష వాయిదా వేసింది కమిషన్).ఆపై ప్రవీణ్.. రేణుకను నమ్మి పేపర్లను ఇచ్చాడు. మరోవైపు పాస్వర్డ్ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది..
ప్రవీణ్ పాస్వర్డ్ను శంకర్ లక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి కొట్టేశానని చెబుతున్నాడు.. అయితే ఆమె మాత్రం పాస్వర్డ్ను తాను డైరీలో రాయలేదని చెబుతోంది. ఈ తరుణంలో.. శంకర్ లక్ష్మీ పాత్రపైనా దర్యాప్తు కొనసాగిస్తోంది సిట్.

Post A Comment: