మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


మార్చి 21 నుండి ప్రారంభమైన సిపిఎం పార్టీ పాదయాత్ర, అడ్డగుంటపల్లి సుందరయ్య నగర్ నుంచి ప్రారంభమైంది, భరత్ నగర్, చంద్రశేఖర్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, ద్వారక నగర్, తిలక్ నగర్లో తిరుగుతూ కామ్రేడ్ జన్నే కొమురయ్య ఇంటివద్ద భోజనం చేశారు, ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యులు, జిల్లా కార్యదర్శి వై యాకయ్య, వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ, ఈ రామగుండం కార్పొరేషన్ లో పేద ప్రజలు ఇండ్లు ఇండ్ల స్థలాలు లేక డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు సరైన మురికి కాలువలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, త్రాగునీరు లేని పరిస్థితి ఉందని, అనేక సంవత్సరాల నుంచి వలస వచ్చిన కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతూ చాలి చాలని ఇండ్లు ఇరుకు గదులలో నివసిస్తున్న పరిస్థితి ఉడియ గుడిసెల్లో ఉందని, ఇక్కడ పరిస్థితులు పాలకవర్గ నాయకులు, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులలో లేదని, పూర్తిస్థాయిలో పేద ప్రజల పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, పోరాటాల ద్వారానే ఇండ్లు ఇండ్ల స్థలాలు స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలియజేశారు, మా పాదయాత్ర ద్వారా వెలుగులోకి వస్తున్న సమస్యల పరిష్కారానికి, రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం, ప్రభుత్వ యంత్రాంగం పేద ప్రజలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పాదయాత్ర బృందం సభ్యులు ఏ మహేశ్వరి, లావణ్య, ఎన్ బిక్షపతి, సిపిఎం పార్టీ కార్యకర్తలు కిషన్, చంద్రయ్య రాజ్ కుమార్, ఎన్ నరసన్న, యం శ్రీనివాస్, ఏం సారయ్య, గుత్తికొండ గోపాల్, ఎస్ వెంకన్న, నాగమణి, రాధాకృష్ణ, అన్నం శ్రీనివాస్, నాయక్, 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: