ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

గణేష్ నిమజ్జన శోభాయాత్ర జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలు, భక్తులు సహకరించాలని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  కోరారు. బుధవారం త్రివేణి సంగమం కాళేశ్వరంలో  నిమర్జనం జరిగే ప్రదేశాలను  ఎస్పి పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లతో పాటు, గణేష్ ప్రతిమలను నిమర్జనం చేసేందుకుగాను క్రేన్ల వినియోగం, సిసి కెమెరాలు, ప ఏర్పాట్లతో పాటు, నిమర్జన ప్రదేశంలో గజ ఈతగాళ్ళ నియామకం,  నిమర్జనం జరిగే సమయంలో పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన విధులతో పాటు, ప్రతిమలను తీసుకువచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి,   అనంతరం వాహనం తిరిగి వెళ్ళే మార్గాలకు సంబంధించి    స్థానిక పోలీసులకు ఎస్పి  పలు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా పోలీస్ ఎస్పి సురేందర్ రెడ్డి   మాట్లాడుతూ గత నెల 31తేదీ నుండి ప్రారంభమైన గణేష్ నవరాత్రులకు సంబంధించి ఈ 9వ తేదిన గణేష్ నిమర్జనం నిర్వహించబడుతుందని, ఇందుకోసం కట్టుదిట్టమయిన చర్యలు తీసుకున్నామని అన్నారు.  గణేష్ మండపాల నిర్వహకులంతా మంచి కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని, వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.

 శోభాయాత్రలో  డి.జె లు వినియోగించవద్దని ఎస్పి స్పష్టం చేశారు.                                                                                               ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు తగిలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు అప్రమత్తంగా   ఉండాలన్నారు.

ఇతర వర్గాలను గాని, మతాలను గాని లేక వ్యక్తులను గాని లక్ష్యంగా చేసుకుని  ఎలాంటి చర్యలు చేయవద్దని,

వినాయక నిమజ్జనo చేసే చెరువులు,  కుంటలు, నదుల వద్ద  ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి  సూచించారు.  జిల్లా లో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, సమస్యలు సృష్టించే ప్రయత్నం ఎవరూ చేసినా, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, నిభంధనలు అతిక్రమించినా సంబంధిత వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని,  ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఎస్పి   హెచ్చరించారు. ప్రశాంత వినాయక నిమజ్జనానికి ప్రతి ఒక్కరూ  సహకరించాలని ఎస్పి  కోరారు. ఈ కార్యక్రమం లో కాళేశ్వరo ఎస్సై  లక్ష్మణ్ రావు, ఏఎస్సై  రాజేశం, పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: