ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పి జె. సురేందర్ రెడ్డి హెచ్చరించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న దృష్ట్యా, కొందరు వ్యాపారులు మధ్య దళారులు రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలు విక్రయిoచే అవకాశం ఉందని ఎస్పి అన్నారు.
నకిలీ విత్తనాల సరఫరాను, నాసిరకం ఎరువులను అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల ఆన్నదాతలు మోసపోకుండా సమర్దవంతంగా పనిచేయాలని,
నకిలీ విత్తనాల ప్రట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో నేరాల నియంత్రణ పై చేపట్టిన చర్యలు, పెండింగులో ఉన్న కేసుల వివరాలను ఎస్పి అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలని, ఎస్పి పేర్కొన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పోలీసు అధికారులు పని చేయాలనీ ఎస్పి
సురేందర్ రెడ్డి అన్నారు.
ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసి టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాలన్నారు.
పోక్సో కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని అధికారులకు ఎస్పి సురేందర్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వి. శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ (ఏఆర్) వి శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు, వర్టికల్ డిఎస్పి కిషోర్ కుమార్ జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Post A Comment: