Articles by "Telangana( తెలంగాణ )"
Showing posts with label Telangana( తెలంగాణ ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నందున ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్కడ భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రూ.100 టిక్కెట్ కొన్న భక్తులను, సాధారణ (ధర్మ) దర్శనానికి వచ్చిన భక్తులను ఒకే క్యూ లైన్‌లో నిలబెట్టడంతో గందరగోళం నెలకొంది.

చాలామంది భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి నిలబడటం కష్టంగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు భక్తులు మాట్లాడుతూ, "మేము రూ.100 టిక్కెట్ కొన్నా కూడా సాధారణ క్యూలోనే నిలబడాల్సి వస్తోంది. దీనివల్ల సమయం వృథా అవుతోంది. ప్రత్యేక క్యూ లైన్ ఉంటే త్వరగా దర్శనం చేసుకునే అవకాశం ఉండేది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుండటంతో నిరాశ చెందుతున్నారు. అందరినీ ఒకేసారి క్యూలో పంపడం వల్ల ఆలస్యమవుతోందని వారు అంటున్నారు.

ఈ సమస్యపై వెంటనే స్పందించాలని భక్తులు దేవాలయ అధికారులను కోరుతున్నారు. టిక్కెట్ కొన్నవారికి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్‌ను, ధర్మ దర్శనం చేసుకునేవారికి మరొక క్యూ లైన్‌ను ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

దేవాలయ అధికారులు ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తారో చూడాలి. భక్తుల యొక్క ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయో వేచి చూడాలి.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, అధిక లోడుతో లారీలు తిరుగుతున్నాయని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నేత మారపల్లి మల్లేశ్, వైఎఫ్ఎ నేత బాపు యాదవ్ ఆరోపించారు. కాటారంలో ఇసుక క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయని, వాటి లైసెన్సులు రద్దు చేయాలని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అధిక లోడుతో వెళ్తున్న లారీల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. తక్షణమే స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని, అధిక లోడుతో తిరుగుతున్న లారీలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మారపల్లి మల్లేశ్ మాట్లాడుతూ, "కాటారం ప్రాంతంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" అని అన్నారు. బాపు యాదవ్ మాట్లాడుతూ, "అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రాజకీయ అండదండలతోనే ఈ అక్రమ దందా కొనసాగుతోంది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం" అని హెచ్చరించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, లారీల రాకపోకల వల్ల దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్, వైఎఫ్ఎ కార్యకర్తలు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి. పి. గౌతమ్ అన్నారు. బుధవారం హనుమకొండ కుడా కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పై వెరిఫికేషన్ అధికారులతో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి. పి. గౌతమ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 


జిల్లాలోని గ్రామాల, గ్రేటర్ వరంగల్ నగరంలోని వార్డుల వారీగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పాటిస్తున్న వేరిఫికేషన్ ప్రక్రియ, అర్హులు, అనర్హుల జాబితాను ఎలా గుర్తిస్తున్నారు, ఇండ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయి, తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి. పి.గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్న డేటా తో వెరిఫికేషన్ క్షేత్ర స్థాయిలో  సరిచూసుకున్న తరువాతనే నియోజక వర్గ నోడల్ అధికారి ద్వారా జాబితాను కలెక్టర్ లాగిన్ కు పంపాలన్నారు. పైలట్ గ్రామాలలో ఇప్పటి వరకు ఇండ్లు ప్రారంభం కాని వారి స్థానంలో ఇతర గ్రామానికి చెందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. వర్ధన్నపేట పరిధిలో పలు ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెరిఫికేషన్ అధికారి చెప్పడంతో హౌసింగ్ ఎండీ గౌతమ్ అభినందనలు తెలిపారు. లబ్ధిదారు వేగంగా ఇల్లు నిర్మాణంలో స్లాబ్ పూర్తి చేసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ప్రాతిపాదికగా తీసుకోవాలని వెరిఫికేషన్ అధికారులకు సూచించారు. లబ్దిదారుడు  సరసమైన ధరలో  దశలవారీగా

ఇండ్ల నిర్మాణం చేసుకునేలా

ప్రతి దశలో అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని అన్నారు. 

ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడిన

ఏఈ లను  ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని,  ఆ తదుపరి త్వరలో నగరంలో చేపట్టే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వార్డులలో అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఇందిరమ్మ కమిటీ దృష్టికి తీసుకెళ్లి, ఆ తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు వార్డుల్లో జాబితా వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే వివరాలను వార్డు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న దృష్ట్యా లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ సామగ్రి ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు  మాట్లాడనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ అధికారులు, మండలాల  తాపీ మేస్త్రి సంఘాలతో త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల జాబితా వెరిఫికేషన్ లో అర్హులు, అనర్హుల జాబితాను సరిచూసుకోవాలన్నారు.వరంగల్ జిల్లాతో పాటు  వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు వార్డుల్లో జాబితా వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే వివరాలను వార్డు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు గ్రేటర్ వరంగల్ పరిధిలోని సోమిడి, వడ్డేపల్లి, దేశాయిపేట ప్రాంతాల్లో వేరిఫికేషన్ అధికారులు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎండి విపి గౌతమ్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే తో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పారదర్శక నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్,  జిల్లా నోడల్ అధికారులు రామిరెడ్డి, రవీందర్ నాయక్, నియోజకవర్గ నోడల్ అధికారులు, వెరిఫికేషన్ అధికారులు తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఒక మహిళపై గొడ్డలితో దాడి జరగడం కలకలం రేపింది. హైటెక్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు గుంటల భూమికి సంబంధించిన వివాదంలో హత్యకు గురైన వ్యక్తి కుమారుడు నిందితురాలిపై దాడి చేశాడు.

కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక లచ్చక్క (42) అనే మహిళ, మారుపాక సారయ్యను హత్య చేసిన కేసులో నిందితురాలు. ఆమెను అరెస్టు చేయగా, కొద్ది రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రతి మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది.

ఆ విధంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న లచ్చక్కపై అంజి అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో లచ్చక్కకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దేవరాంపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమి విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 14న సారయ్యను లచ్చక్కతో పాటు మరో ముగ్గురు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు గురైన సారయ్య కుమారుడు అంజి, తల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశాడు. సరైన సమయం కోసం వేచి చూసి, మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుటే లచ్చక్కపై దాడి చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్;

 

హనుమకొండ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో  వివిధ వసతుల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిని గురించి  జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. 


అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన విద్యుత్తు, తాగునీరు, టాయిలెట్స్ పనులను పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ముఖ్య ప్రణాళిక అధికారి  సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు, సీడిపి ఓలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి చట్టం ఆధారంగా భూ సమస్యలు  పరిష్కారం అవుతాయని  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

మంగళవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలం సర్వాపూర్, ముస్త్యాలపల్లి  గ్రామాల లో  భూభారతి చట్టంపై  రెవెన్యూ సదస్సులను  అధికారులు నిర్వహించారు. 

ఈ రెవెన్యూ సదస్సులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుకు జిల్లాలో నడికూడ మండలాన్ని ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. రెవెన్యూ సదస్సులో రైతులు అందించే విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  స్వాతంత్ర్య  భారతదేశంలో 1954లో కాస్ర పహాణి ద్వారా భూ రికార్డులకు సంబంధించి బేస్ డాక్యుమెంట్ ఉండేదన్నారు. 2020 లో ధరణి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. గతంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేదిగా కొత్తగా తీసుకువచ్చిన ధరణి చట్టం ఉండాలి కానీ దాని ద్వారా భూ సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యాయని అన్నారు. ధరణి చట్టం గ్రామాలలో భూ సమస్యలు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమైందన్నారు. గతంలో భూ రికార్డులలో పట్టాదారులు ఉన్నప్పటికీ ఖాస్తు కాలమ్ లో అనుభవదారు కాలమ్ ఉండేదన్నారు. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత అనుభవదారు కాలమ్ ను తీసేసారని అన్నారు. అనుభవదారు కాలమ్ తీసివేయడం పెద్ద తప్పిదమన్నారు.   ఇందిరమ్మ ప్రభుత్వం రావడానికి రైతులు ప్రధాన భూమిక పోషించారని అన్నారు. పైలెట్ గా ఎంపికైన నడికూడ  మండలంలో రైతులు సూచించిన సమస్యలను క్రోడీకరించి ఈ నెల చివరినాటికి ఈ గ్రామాలకు సంబంధించి భూ సమస్యలను తహసిల్దార్ ఆర్డీవోలు తగిన పరిష్కారానికి చర్యలు చేపడతారని అన్నారు. సర్వేయర్లు లేకపోవడంతో అనేక చోట్ల సర్వే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీనిలో భాగంగానే ప్రత్యేకంగా సర్వేయర్లను  నియమిస్తున్నారని తెలిపారు.  కలెక్టర్ స్థాయిలోనే  భూ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. 1954 లో వచ్చిన కాస్రా పహాని  బేస్ గా ఉందో అదేవిధంగా భూభారతి చట్టం  భూ సమస్యల నమస్కారానికి బేస్ గా ఉండాలనేది  ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. 

 

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పెట్టుకున్న రైతులకు వారి చుట్టుపక్కల ఉన్నవారికి  నోటీసులు అందించి  క్షేత్రస్థాయిలో విచారించి నెలాఖరు వరకు పరిష్కారమవుతాయన్నారు. పైలెట్ మండలంలో ఉన్న నడికూడ మండలంలో 90 శాతం వరకు  భూ సమస్యలు నెలాఖరు వరకు పరిష్కారమవుతాయన్నారు.  మిగిలిన 10 శాతం సమస్యలను కూడా పరిష్కరించేందుకు  చర్యలు చేపడతామన్నారు. సమస్యలు ఉన్న రైతులు అర్జీలను అందించాలని కలెక్టర్ సూచించారు. 

ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, హనుమకొండ  డిప్యూటీ కలెక్టర్ మంగీలాల్, నడికూడ తహసిల్దార్  నాగరాజు, ఇతర అధికారులతో పాటు స్థానిక  రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్ ;

సమాజాభివృద్ధి కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాయలు కోరారు . విద్యార్థి దశలో మరుపురాని జ్ఞాపకాలను నెమరువేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేమని అన్నారు. హన్మకొండలోని భీమారంలో ఉన్న వి.ఆర్ కన్వెన్షన్ లో సోమవారం నాడు జరిగిన ధర్మసాగర్ మండలంలోని పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 1974 -75 సంవత్సరం ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.నల్సార్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాయలు పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థి కావడం తో పాటుగా సమావేశానికి హాజరు కావడం ఈ సమ్మేళనానికి శోభనిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాల లో చదివిన పూర్వ విద్యార్థులు కృషి చేయాలని కోరారు. 60 ఏళ్ల పిదప విశ్రాంతి తీసుకోకుండా సమాజాభివృద్ధి లో భాగస్వామి కావాలని ఆయన కోరారు. పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థి యైన తాను ఈ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

పూర్వ విద్యార్థులంతా తమ వయసుని పక్కన పెట్టి ఈ కార్యక్రమం లో పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పెద్ద పెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1974-75 సంవత్సరపు ఎస్ ఎస్ సి బ్యాచ్ విద్యార్థులైన ప్రముఖ వ్యాపార వేత్త మామిడాల సురేందర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల రిటేర్డ్ ప్రిన్సిపాల్ ఉపేందర్,1974-75 సంవత్సర విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.