April 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలంలోని బయ్యారం నుంచి పోతులవాయి గ్రామం వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతిని వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మార్గంలో అనేక చోట్ల పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రతిరోజూ ఈ రహదారిని వినియోగించే ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో చిన్నపాటి ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

TG: మానవత్వాన్ని మర్చిపోయేలా చేసిన దారుణ ఘటన హనుమకొండ జిల్లా పున్నేలులో చోటుచేసుకుంది. కొడుకు కావాలనే అంధ విశ్వాసం, మూర్ఖమైన ఆశ ఒక తండ్రిని కిరాతకుడిగా మార్చింది. అజహరుద్దీన్ అనే వ్యక్తి తన గర్భిణి భార్యతో పాటు ఇద్దరు అమాయక కూతుళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ముంచి హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇంకోసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో, తనకే ప్రాణంగా ఉండాల్సిన కుటుంబాన్ని చంపేయడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. “నాన్న” అని పిలిచిన ఆ చిన్నారుల ప్రేమ కూడా అతని గుండెను కరిగించలేకపోయింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతుళ్లపై వివక్ష ఇంకా సమాజంలో బతికే ఉందనే చేదు నిజాన్ని ఈ దారుణం మరోసారి బయటపెట్టింది.