ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

వరంగల్ బల్దియా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.

మంగళ వారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ ఛాంబర్ లో 

హార్టికల్చర్ మెప్మా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మేయర్ పాల్గొని మాట్లాడారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మెప్మా సి ఓ లు, ఆర్ పి లు డివిజన్ కార్పొరేటర్ ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మొక్కలు అందజేయాలని, బల్దియా పరిధిలోగల నియోజక వర్గాల్లో టి ఎల్ ఎఫ్ ల ద్వారా ఇందిర మహిళా సంబురాలు ప్రతి నియోజక వర్గాల్లో జరగాలని, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరిన ఎస్ హెచ్ జీ మహిళల విజయ గాధలను స్వయంగా వారే తెలియజేయాలని అన్నారు.

ప్రతి ఇంటికి అర్బన్ ప్రాంతంలో ఐతే 4 మొక్కలు, విలీన గ్రామాలలో ఐతే 6 మొక్కలను అందజేయడం జరుగుతుందని, అట్టి మొక్కలను నాటి సంరక్షించేలా చూడాలని అన్నారు. ఏవేన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర పరిధి లోని కుంటలు, నీటి కొలను చుట్టూ ఈత చెట్లు నాటాలని, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బల్దియా పరిధి లో 15 లక్షల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునేలా చూడాలని మేయర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, హెచ్ ఓ లు రమేష్, లక్ష్మారెడ్డి టిఎంసి రమేష్, సి ఓ లు ప్రవీణ్, సకినాల రమేష్ రాజ్ కుమార్, శ్రీలత రజిత శ్రీనివాసులు గుండు రమ సఫియా హరికల్టర్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: