హన్మకొండ ;
హనుమకొండలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని C.H. రమేష్ బాబు, ప్రధాన న్యాయమూర్తి, హనుమకొండ గారు హంటర్ రోడ్లోని మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలో(గర్ల్స్) క్యాంపుకి హాజరు అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ టీచర్స్, పిల్లలలో వ్యకిఅంతరా భేదాలను గుర్తించి వారిని ఆయా రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ ఒక నేరము అని, ఎవరు ప్రోత్సహించరాదని చెప్పారు. స్కూల్ లో కానీ, ఇంటి వద్ద కానీ ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హనుమకొండని సంప్రదించాలని చెప్పారు. ఈ క్యాంపులో శ్రీమతి క్షమా దేష్పాండే సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హనుమకొండ మరియు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, రీజినల్ లెవెల్ కో-ఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: