మహాముత్తారం మండలం కనుకునూరు, రెడ్డిపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. 2,400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 25 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Post A Comment: