మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్,  నూతనంగా పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా రావుల రాజేందర్ ను నియమించిన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో జరిగే భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు వెళుతున్న సందర్భంలో రామగుండం రైల్వే స్టేషన్లో ఘనంగా సన్మానించడం జరిగింది.. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్  మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని, బండి సంజయ్  నాయకత్వంలో పనిచేయాలని, దేశం కోసం ధర్మం కోసం హర్నిశలు కష్టపడి పనిచేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో నవాబు గిరి నైజాం గిరి పాలను అంతం చేసి  భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ , మాడా నారాయణ రెడ్డి , బిజెపి సీనియర్ నాయకులు  భుష్పక సంతోష్ మహారాజ్ , తమ్మనవేని మల్లేష్, గుర్రం సురేష్ , మాచర్ల అశోక్, బొంకూరు మహేష్, ఇంజంపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: