మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం కావద్దు తెలంగాణ ప్రజల జీవితాలు వెలుగులోకి రావాలని ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటడానికి సీఎల్పీ నేత   బట్టి విక్రమార్క  మొదలుపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 

రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్  అధ్వర్యంలో భారీ జన సందోహంతో అంతర్గాం మండలం అకెనపల్లి సోమనపల్లి గ్రామ ప్రజలు గణ స్వాగతం పలికినారు.

మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క  నాయకత్వంలో   పలు గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పెన్షన్స్ గానివ్వండి డబుల్ బెడ్ రూములు గానివ్వండి దళిత బంధు కానివ్వండి దళితులకు మూడు ఎకరాల భూమి గానీ  రైతులకు పంట రుణమాఫీ కానివ్వండి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల గురించి కానివ్వండి,  RFCL లో జరిగిన అవకతవకల గురించి, సింగరేణి నీ ప్రైవేట్ పరం చేస్తూ వారి అనునాయులకే బొగ్గు బ్లాక్ లను కేటాయించడంలో కానీ  ఎన్ టి పి సి ప్లాంట్ నుండి వెలువడే బూడిదను అమ్ముకోవడం కానివ్వండి ఇసుక అమ్ముకోవడం కానివ్వండి ప్రజల సమస్యలను ఎండగడుతూ శ్రీరామ్ సాగర్, శ్రీపాద,ఎల్ ఎం డి,కడెం ప్రాజెక్ట్ లను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి డ్యామ్లను ఇవ్వాలా ట్యాపులు దిప్పి కాలేశ్వరం నీళ్లంటే  జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరని తస్మాత్ జాగ్రత్త రాబోయే రోజుల్లో ప్రజలు మీకు తగిన శాస్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మాట్లాడారు.

   ప్రజా సమస్యలను తెలుసుకుంటూ  అకెనపల్లి గ్రామంలో మొదలైన పాదయాత్ర సోమనపల్లి ఎగ్లాస్పూర్, పాలకుర్తి,బసంత్ నగర్,కుక్కల గూడూరు, పుట్నూరు,జయ్యారం వరకు రామగుండం నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగి ధర్మపురి నియోజకవర్గం ఇంచార్జి వడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు బాధ్యతలు అప్పగిస్తూ తాడ్వాయి గ్రామ శివారు వద్ద భట్టి విక్రమార్క  పాదయాత్ర మక్కన్ సింగ్  అధ్వర్యంలో ముగిసినది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: