మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని భాస్కర్ రావు భవన్ ఏఐటియుసి కార్యాలయంలో ఓబి కాంట్రాక్టు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాతవాహన మల్టిపుల్ వర్కర్స్ యూనియన్ నాయకులు  కౌశిక్ హరి,AITUC ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, CITU అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, IFTU (ప్రజాపంథా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, IFTU (న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ,INTUC తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల కార్యదర్శి పూసాల తిరుపతి,TCKS (తెరాస) అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఓబి యాజమాన్యాలు కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలతో చర్చించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. మార్చి 6 తారీకు నుంచి సమ్మె ప్రకటించినప్పటికీ మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్నది విఫలం చేసేందుకు మాత్రం కుటిలయత్నాలను కొనసాగిస్తున్నాయి. ఓబి యాజమాన్యాలు ఎంతగా బెదిరింపులకు దిగినా పట్టుదలతో సమ్మెను విజయవంతం చేయాలని, తమ హక్కులు సౌకర్యాలపై జరిగే సమ్మెను విజయవంతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. మార్చి 6 నుంచి జరిగే సమ్మెకు ఓబి యాజమాన్యాల మొండి వైఖరి ప్రధాన కారణమని చట్ట ప్రకారం కార్మిక సంఘాలతో చర్చలకు ఆహ్వానించకుండా సమ్మెకు దారి చేసే పరిస్థితులు కల్పిస్తున్నాయని తెలియజేస్తున్నాం. ఐక్యంగా జరగబోయే సమ్మెను విజయవంతంగా కొనసాగించే విజయం సాధించాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు.

ఓబీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు AITUC నాయకులు బుర్ర తిరుపతి,CITU నాయకులు వేల్పుల కుమారస్వామి, IFTU (ప్రజా పంథా) నాయకులు తోకల రమేష్, IFTU (న్యూడెమోక్రసీ) నాయకులు ఏ వెంకన్న, INTUC నాయకులు పూసాల తిరుపతి,TCKS నాయకులు మద్దెల శ్రీనివాస్, ఎంఏ గౌస్, శనగల శ్రీనివాస్ తదితరుల తో పాటు 500 మంది కార్మికులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: