ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కలెక్టర్ కార్యాలయంలో గర్బ ధారణ పూర్వ గర్భస్థ పిండ (లింగ నిర్ధారణ) పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్, హనుమకొండ అధ్యక్షతన జరిగినది. జిల్లా లో చట్ట అమలు తీరును, చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మరియు పి.హెచ్.సి ల వారీగా అమ్మాయిల జననాలను సమీక్షించడo జరిగింది.
జిల్లాలో అమ్మాయిల జననాలు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదే విధముగా స్కానింగ్ పరీక్షలు దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,అక్రమంగా అబార్షన్ లు నిర్వహిస్తున్న ఆసుపత్రుల పైన మరియు స్కానింగ్ సెంటర్ ల పైన నిఘా మరియు పర్యవేక్షణ లు పెంచాలని ఎన్జీవో లు భాద్యత తీసుకోవాలని, గ్రామం జిల్లాలోని కళాజాత బృందాలను ఉపయోగించుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, మహిళా సమాఖ్య సభ్యుల మీటింగ్ జరిగినప్పుడు మీటింగులో పి సి పి ఎన్ డి టి చట్టంపై అవగాహన కల్పించాలని జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్ ఆదేశించారు. పద్మజ, జడ్జ్ ఫ్యామిలీ కోర్టు మరియు 2 వ అడిష్ నల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, మాట్లాడుతూ జిల్లా లో ఇన్స్పెక్షన్ టీమ్ లను పెంచాలని, రాత్రిపూట ఆకస్మిక తనిఖీలను పెంచాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ హనుమకొండ డాక్టర్. యాకూబ్ పాషా, ఏసిపి స్పెషల్ బ్రాంచ్ అబ్దుల్ రెహమాన్, ఆర్ కృష్ణ మూర్తి మారి ఎన్జీవో, ఎల్. చంద్ర శేఖర్, డిప్యూటీ డెమో కే. ప్రసాద్ , మాధవ రెడ్డి పాల్గొన్నారు.

Post A Comment: