ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లా కలెక్టర్, కుడా చైర్మన్, వైస్ చైర్మన్, అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పురోగతి పనులను  చీఫ్ విప్ పరిశీలించారు. 

కాళోజీ కళాక్షేత్ర పనులలో వేగం పెంచి  తెలంగాణ అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విజయభాస్కర్ ఆదేశించారు.

మంగళవారం హనుమకొండలో కొనసాగుతున్న కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వినయ భాస్కర్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కుడా వైస్ చైర్మన్ బల్దియా కమిషనర్ ప్రావీణ్య, కూడా చైర్మన్ సుందర్ యాదవులతో కలిసి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అనేక చారితాత్మక కట్టడాలు నగరంలో ఉన్నాయని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  కళలకు నిలయమైన ఈ నగరం లో ముఖ్యమంత్రి  కాళోజీ పుట్టిన గడ్డమీద అనేక మంది కవులు,కళాకారులను సన్మానించడం తో పాటు ప్రపంచం లోనే గొప్ప గుర్తింపు తెచ్చే విధం గా కళా క్షేత్రాన్ని నిర్మించడానికి రాష్ట్రం ఏర్పడ్డ 100 రోజుల్లోనే నగరానికి వచ్చి  హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రముఖ కాంట్రాక్టర్ చే నిర్మించడం జరుగుతున్నదని,  నిర్మాణానికి కావలసిన సామగ్రి ఇతర దేశాల నుండి రావడం లో కొంత జాప్యం,కరోనా నేపథ్యంలో నిర్మాణం లో కొంత ఆలస్యం జరిగిందని, ఇటీవల పురపాలక శాఖా మంత్రి వర్యులు కే.టి.ఆర్. ప్రత్యేక చొరవతో  నిధులు కేటాయించడం వల్ల పనులు ప్రారంభం కావడం జరిగిందనీ అన్నారు. కాళోజీ గొప్ప చరిత్రను భావితరాలకు అందించే విధం గా కృషి చేయడం తో పాటు కవులకు, కళాకారులకు నిలయం గా ఈ కళా క్షేత్రం పనిచేస్తోందని, నిర్మాణ పనులను వేగవంతం చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం లోగా పూర్తి చేయాలని

ఆదేశించారు.

కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్య మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనుల బాధ్యతలను గత నవంబర్లో పర్యాటక శాఖ నుండి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకోవడం జరిగిందన్నారు. కాళోజీ కళా  క్షేత్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం

73 కోట్ల రూపాయలు  మంజూరు చేసిందని, అందులో మొదటి విడతలో మంజూరైన 23 కోట్ల రూపాయలను ఖర్చు చేసి సివిల్ వర్క్ నిర్మాణం చేయడం జరిగిందని, రెండో విడతల్లో మంజూరైన 40 కోట్ల రూపాయలతో ఇంటీరియర్ డిజైనింగ్ ఫినిషింగ్ వర్క్ చేపట్టడం జరుగుతుందన్నారు. పనులు త్వరితంగా చేపట్టుటకుగాను అధికారులు కాంట్రాక్టర్లతో పలు దఫాలు సమావేశాలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు.  లేబర్ ను అధికంగా పెంచి రాత్రింబవళ్లు పని చేయించి నిర్దిష్ట గడువులోగా పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్ అజిత్ రెడ్డి , ఈఈ భీం రావు, హార్టికల్చర్ ఆఫీసర్ వేణుగోపాల్ టూరిజం అధికారి శివాజీ, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస రావు, అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: