కాటారం టౌన్, సెప్టెంబర్ 19:
దేశానికి వెన్నెముక రైతు అని పేర్కొంటూ, రైతులకు సరిపడా యూరియాను అందించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కాటారం మండల కేంద్రంలో రైతులతో చర్చించిన ఆయన, వారి సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకూడదని, సమయానుసారంగా సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. రైతు సమస్యలు పరిష్కరించడం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నారాయణరెడ్డి గుర్తుచేశారు. రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పోరాడతామని హామీ ఇచ్చిన నారాయణరెడ్డి, “రైతు బలమే దేశ బలం” అని పునరుద్ఘాటించారు.

Post A Comment: