జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం అన్నారం (సరస్వతి) బ్యారేజీ వద్ద సోమవారం జరిగిన పడవ ప్రమాదం విషాదంగా మారింది. మహారాష్ట్ర శిరోంచ తాలూకాకు చెందిన గడ్డం వెంకటేశ్ కృష్ణ స్వామి  ఇద్దరు మంచిర్యాల జిల్లా పొక్కుర్ గ్రామానికి వెళ్లి చేపలు పట్టే ఒక చిన్న పడవను కొనుగోలు చేసి, గోదావరి నది ద్వారా స్వగ్రామానికి బయలుదేరారు.

అయితే ప్రయాణం మధ్యలో అన్నారం బ్యారేజీ వద్ద గేట్లకు పడవ తగలడంతో అది అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో గడ్డం వెంకటేశ్ ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అతని స్నేహితుడు కృష్ణ స్వామి మాత్రం ప్రాణాలతో బయటపడగలిగాడు.


గాలింపు చర్యలు – మృతదేహం వెలికితీత

గల్లంతైన వెంకటేశ్ కోసం మత్స్యకారులు, పోలీసులు రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించారు. మంగళవారం ఉదయం పలుగుల వద్ద గాలింపు చర్యల సమయంలో వెంకటేశ్ మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 స్థానికుల ఆవేదన
అన్నారం బ్యారేజీ వద్ద తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణా చర్యలు, కాపలా సిబ్బంది లేని కారణంగానే తరచూ మానవ ప్రాణనష్టం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.

 భవిష్యత్తులో ప్రమాదాల నివారణపై డిమాండ్
ఇకనైనా ప్రభుత్వం, జలవనరుల శాఖ తగిన చర్యలు తీసుకోవాలని, బ్యారేజీ వద్ద రక్షణా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: