జయశంకర్ భూపాలపల్లి జిల్లా 29 ఆగస్టు, 2025 శుక్రవారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) అనే యువతి, తన తండ్రి ఇటీవల మరణించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ ఆవేదనను తట్టుకోలేకపోయిన ఆమె, ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామం పరిసరాల్లో, బంధువుల వద్ద, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి వారు నిరాశతో ఈ నెల 6న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, కాటారం శివారులోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఒక యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహం పక్కన కుంకుమ, నిమ్మకాయలు, ఆధార్ కార్డు వంటి వస్తువులు కూడా ఉండటంతో, ఆ యువతిని వర్షిణిగానే పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.




Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: