వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

వరంగల్ బల్దియా పరిధి లోని అనధికారిక లే ఔట్ లను గుర్తించి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని  నగర మేయర్  గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 

బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ చాంబర్ లో టౌన్ ప్లానింగ్ అధికారులతో  జరిగిన సమావేశంలో మేయర్   సమర్థవంతంగా నిర్వహించుటకు  అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో  అనధికారిక లే ఔట్ లు ప్లాట్ లను కొనుగోలు చేయకూడదని, వీటి పట్ల ప్రజల్లో చైతన్యం  కలిగించడానికి టౌన్ ప్లానింగ్ విభాగం  వివిధ సామాజిక మాధ్యమాలు కరపత్రాలు ఫ్లెక్సీ ల ద్వారా అవగాహన కలిగించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. 

మున్సిపాలిటీ కి చెందిన ఓపెన్ ప్లాట్లు, కాంపౌండ్ వాల్ లేని మున్సిపల్ స్థలాలు, పార్కు లు  బల్దియాకు చెందిన ప్రాపర్టీలని సూచించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రీన్ ఏరియాకు సంబంధించిన ప్రాపర్టీ ని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించాలని, బల్దియా వ్యాప్తంగా  క్షేత్ర స్థాయి లో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అనధికార లేఅవుట్ లు, ముందస్తుగా  గుర్తించాలని, వర్షాకాలం నేపద్యం లో నగర వ్యాప్తం గా ఉన్న శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వారికి నోటీసులు అందించి ప్రాణ, ధన నష్టం కలుగ కుండా ఖాళీ చేయించాలని,  అపార్ట్మెంట్ లలో  గల సెల్లార్ ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులకు సూచించారు.

 కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శ్రీనివాస్ రెడ్డి రజిత యెర్షాద్ ప్రశాంత్ తోపాటు టిపిఎస్ లు టి పి బి ఓ లు తదితరులు పాల్గొన్నారు.


మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు చేపట్టండి: కమిషనర్ 

ఖాజీపేట మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్  అధికారులను ఆదేశించారు.బుధవారం కమిషనర్ నగర పరిధి లోని ఖాజీపేట మార్కెట్ బాల సముద్రం ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి లో సందర్శించి సమర్థవంతం గా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ... రోడ్ల మీద వ్యాపారాలు నిర్వహించడం వల్ల వినియోగదారులు మార్కెట్ లోకి రావడంలేదని, కాజీపేట మార్కెట్ కు సంబంధించి  స్థానిక  మార్కెట్ దారులు  ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రోడ్డు మీద  కూరగాయలు అమ్మే  వారిని మార్కెట్ లో వ్యాపారాలు  నిర్వహించుకునేలా చూడాలని  ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ లు  ఓపెన్ చేసి మటన్ చికెన్  విక్రయించే దుకాణాలను అక్కడే వ్యాపారాలు నిర్వహించేలా చూస్తూ  మార్కెట్ ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.  కూరగాయల మార్కెట్ యందు  పోలీసు, పట్టణ ప్రణాళిక విభాగం  ఇంజనీరింగ్ విభాగాల  సమన్వయంతో  స్ట్రీమ్ లైన్ చేసి వీధి వ్యాపారులకు  ఉపాధి అందేలా చూడాలని, స్లాటర్ హౌస్ చిన్నగా ఉందని  ఇందుకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అవకాశం ఉంటే నూతన వదశాల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

 బాలసముద్రంలోని   కోకో పిట్ యూనిట్ ను పరిశీలించిన కమిషనర్  నిర్వహణ బాగుందని, కొబ్బరి బొండాల వ్యర్థాలు ఎక్కువగా పేరుకు పోయి ఉన్నాయని, వేగవంతంగా ప్రాసెసింగ్ చేసి నిల్వ లేకుండా చూడాలని అన్నారు. ఈ యూనిట్ కార్పొరేషన్ కు మోడల్ గా  నిలుస్తుందని తెలిపారు. వర్మీ కంపోస్ట్ యూనిట్ చాలా బాగుందని  దీనిని మరింత బలోపేతం చేయడానికి మరో షెడ్ ను ఏర్పాటు  చేసి సామర్థ్యాన్ని పెంచాలని ఈ ఈ నీ ఆదేశించారు. బయో  మిథనైజేషన్  ప్లాంటుకు మరమత్తులు చేపట్టి పునరుద్ధరించాలని అలా కాని పక్షంలో ఇదే ప్రాంతం లో నూతన  బయో మిథనైజేషన్  ప్లాంటు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని విండ్రో కాంపోస్టు యూనిట్ ఉన్న ప్రాంతంలో నీరు చేరుతుందని దానిని అరికట్టడానికి అక్కడ మొరం వేసి  అరికట్టి బలోపేతం చేయాలని కమిషనర్ అన్నారు.కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా. రాజారెడ్డి,   వెటర్నరీ వైద్యులు డాక్టర్ గోపాలరావు, ఈ ఈ రవి కుమార్, డి ఈ  సారంగం ఏ ఈ లు రాగి శ్రీకాంత్ మేనక సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, వావ్ ప్రతినిధి పవన్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: