ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో సంచలనం సృష్టించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఇన్ఛార్జ్ వినాయక ప్రసాద్, క్రీడా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద ఉన్న శాయ్ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వినాయక ప్రసాద్ పది మందికి పైగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వినాయక ప్రసాద్పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Post A Comment: