మేడిగడ్డ టీవీ న్యూస్ ప్రతినిధి మధు
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఆత్మకూరులో గత నాలుగు రోజులుగా ధార్మిక కార్యక్రమాలు జరుగుచున్నవి ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా నాల్గవ రోజు శనివారం భజన కార్యక్రమం స్థానిక భజన మండలి వారిచే వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరిగింది, ధార్మిక ఉపన్యాసాలు కుంకుమ పూజలు భజనలు మొదలగు కార్యక్రమాలు గత నాలుగు రోజులుగా అతి వైభవంగా జరిగాయి ఆలయ అర్చకులు శ్రీమాన్ ఆరుట్ల మాధవ మూర్తి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే గ్రామ గ్రామాన ధార్మిక కార్యక్రమాలు జరగడం వల్ల హిందూ సనాతన ధర్మ పరిరక్షణ జరుగుతుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో టిటిడి ధార్మిక మండల ఉపన్యాసకులు నాగబండి శివప్రసాద్, పోలు రాజేష్ కుమార్, టింగిల్ కారి సత్యనారాయణ, పరికరాల వాసు, మునుకుంట్ల సతీష్, ఉప్పుల లింగన్న, పాపని రూపా దేవి, రేవూరి పుష్పలీల, బాదం జ్యోతి, తాళ్లపల్లి గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: