మేడిగడ్డ టీవీ న్యూస్ ప్రతినిధి మధు
పరకాల నియోజకవర్గం-ఆత్మకూరు
దేశంలో కుల,మత,లింగ బేధాలు లేకుండా అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం అదృష్టమని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ అన్నారు, సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండల యూత్ అధ్యక్షుడు తనుగుల సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్, హాజరై మాట్లాడారు, మొదటగా అంబేద్కర్ జయంతి సందర్భంగా బీసీ,ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్,ప్యాడ్స్ అందించి మొక్కలు నాటారు, అనంతరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ మాట్లాడుతూ యువత,విద్యార్థులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని చదువుతోపాటు సమాజ శ్రేయస్ కోసం పాటుపడాలని అన్నారు యువత పెడదారిన పట్టకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడాలని అన్నారు. యువత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే సమాజంతో పాటు వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.భారత రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు
అంబేద్కర్ విద్యార్థి దశ నుంచే సమాజ శ్రేయస్సుకోసం నిరంతరం పాటుపడ్డ మహానీయుడని ఆయనను అందరు ఆదర్శంగా తీసుకొని ఆశయాలను కొనసాగించాలన్నారు,
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు దామెర రాజు,కొమ్ము శ్రవణ్, మండల కార్యదర్శులు పిట్టల రాజకుమార్, బండారి శివకుమార్,ఉపాధ్యక్షుడు మంగ రాజు, కార్యదర్శి సిలువేరు రాజు,మండల యూత్ నాయకులు మార్త కేదారి, రాచర్ల సురేష్, శ్రీశైలం, సయ్యద్ కరీం, తనుగుల సాయి కుమార్,నెమద్,కలవుద్దీన్ తదితర యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post A Comment: